||సుందరకాండ ||

||అరువది మూడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 63|| with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

 

సుందరకాండ.
అథ త్రిషష్టితమస్సర్గః||

శ్లో|| తతో మూర్ధ్నా నిపతితం వానరం వానరర్షభః|
దృష్ట్వైవో ద్విగ్నహృదయో వాక్తమేత దువాచ హ||1||
ఉత్తిష్టోత్తిష్ఠ కస్మాత్త్వం పాదయోః పతితో మమ|
అభయం తే భవేత్ వీర సర్వ మేవాభిదీయతామ్||2||

స||తతః వానరర్షభః మూర్ధ్నా నిపతితం వానరం దృష్ట్వా ద్విగ్న హృదయః ఇయయ్ వాక్యం ఉవాచ హ||వీర ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ కస్మాత్ మమ పాదయోః త్వం పతితః | తే అభయం భవేత్ | సర్వం ఏవ అభిధీయతామ్||

తా|| అప్పుడు ఆ వానరేంద్రుడు తన కాళ్ళమీద శిరస్సు పెట్టిన ఆ వానరుని చూచి అదుర్దాగావున్న హృదయముతో ఈ మాటలు పలికెను."ఓ వీరుడా లెమ్ము .లెమ్ము. ఎందుకు నా కాళ్లమీద నీవు పడ్డావు.నీకు అభయము ఇచ్చు చున్నాను. అన్ని విషయములు చెప్పుము." అని.

శ్లో|| స తు విశ్వాసితః తేన సుగ్రీవేణ మహాత్మనా|
ఉత్థాయ సుమహాప్రాజ్ఞో వాక్యం దధిముఖోఽబ్రవీత్||3||

స|| సుమహాప్రాజ్ఞః దధిముఖః తేన సుగ్రీవేణ విశ్వాశితః ఉత్థాయ సః వాక్యః అబ్రవీత్||

తా|| ఆ వివేకముగల దధిముఖుడు ఆ సుగ్రీవునిచేత ఆవిధముగా అభయము ఇవ్వబడి లేచి నిలబడి ఈ వాక్యములు చెప్పెను.

శ్లో|| నైవర్‍క్ష రజసా రాజన్ న త్వయా నాపి వాలినా|
వనం విసృష్టపూర్వం హి భక్షితం తచ్చ వానరైః||4||
ఏభిః ప్రదర్షితాశ్చైవ వానరా వనరక్షిభిః|
మధూన్యచిన్తయత్వేమాన్ భక్షయంతి పిబంతి చ ||5||
శిష్టమత్రాపవిధ్యంతి భక్షయంతి తథాపరే|
నివార్యమాణాస్తే సర్వే భ్రువౌ వై దర్శయంతి హి||6||

స|| రాజన్ ఋక్షరజసా నైవ విశ్రుష్టపూర్వం హి త్వయా న వాలినా అపి న తచ్చ వనం వానరైః భక్షితమ్||ఏభిః వనరక్షిభిః ప్రధర్షితశ్చఏవ ఇమాన్ అచిన్తయిత్వా మధూని భక్ష్యన్తి పిబన్తి చ|| శిష్టం అత్ర అపవిధ్యన్తి | అపరే తథా భక్షయన్తి| తే సర్వే నివార్యమానః భృవః దర్శయన్తి చ||

తా|| ఓ రాజా ! ఋక్షరజసుని చేత గాని అందుకు ముందుగాని, వాలిచేతగాని నీ చేత గానీ అనుమతి ఇవ్వబడని ఆ వనము వానరులచేత తినబడినది. ఈ వనరక్షకులచేత నివారింపబడినప్పటికీ వినకుండా మధుభక్షణము చేసి మధుపానము కూడా చేసిరి. తాగిన పిమ్మట మిగిలినది పారవేస్తున్నారు. ఇతరులు ఇంకా తినుచున్నారు. వారు ఆపబడినప్పుడు కనుబొమలు ఎత్తుచున్నారు.

శ్లో|| ఇమే హి సంరబ్ధతరాః తథా తైః సంప్రధర్షితాః|
వారయంతో వనాత్ తస్మాత్ క్రుద్ధైర్వానరపుంగవైః||7||
తతస్తైర్బహుభిర్వీరైః వానరైర్వానరర్షభః|
సంరక్తనయనైః క్రోధార్ధరయః ప్రవిచాలితాః||8||
పాణిభిర్నిహతాః కేచిత్ కేచిత్ జానుభిరాహతాః |
ప్రకృష్టాశ్చ యథాకామం దేవమార్గం చ దర్శితాః||9||
ఏవ మేతే హతాః శూరాః త్వయి తిష్ఠతి భర్తరి|
కృత్స్నం మధువనం చైవ ప్రకామం తైః ప్రభక్ష్యతే||10||

స|| తథా తస్మాత్ వనాత్ వారయన్తః సంరబ్ధతరాః క్రుద్ధైః తైః వానరపుంగవైః ఇమే సంప్రధర్షితాః ||వానరర్షభ తతః క్రోధాత్ సంరక్తనయనైః వీరైః బహుభిః తైః వానరైః హరయః ప్రవిచాలితః||కేచిత్ పాణిభిః నిహతాః| కేచిత్ జానుభిః ఆహతాః| యథాకామం ప్రకృష్టాః దేవమార్గం దర్శితాః చ||త్వయి భర్తరి తిష్ఠతి ఏతే శూరాః ఏవం హతాః | తైః కృత్స్నం మధువనం చైవ ప్రకామం ప్రభక్ష్యతే||

తా|| "అప్పుడు ఆ వనమునుండి నివారింపబడిన ఆవానరపుంగవులు కోపించినవారై ఈ రక్షకులను ఎదుర్కొనిరి. ఓ వానరేంద్ర అప్పుడు క్రోధముతో రక్తము నిండిన కళ్ళతో వున్న ఆ వీరులు అనేకమందిచేత ఈ రక్షకులు తరిమికొట్టబడిరి. కొందరు చేతితో కొట్టబడిరి. కొందరు మోకాళ్లతో తన్నబడిరి. ఇష్టమువచ్చినట్లు కొట్టబడి వారు ఆకాశమార్గములోకి విసరబడిరి. నీవు రాజు వున్నప్పుడే ఈ శూరులు ఈ విధముగా కొట్టబడిరి. నీ మధువనమును ధ్వంసముచేసి ఇష్టము వచ్చినట్లు భక్షించుచున్నారు".

శ్లో|| ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభమ్|
అపృచ్ఛ తం మహాప్రాజ్ఞో లక్ష్మణః పరవీరహ||11||
కిమయం వానరో రాజన్ వనపః ప్రత్యుపస్థితః|
కం చార్థమభినిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీత్||12||

స|| ఏవం విజ్ఞాప్యమానం తం వానరర్షభం సుగ్రీవం మహాప్రాజ్ఞః పరవీరహ లక్ష్మణః అపృచ్ఛత్||రాజన్ కిం వనపః అయః వానరః ప్రత్యుపస్థితః | దుఃఖితః కం | అర్థమ్ అభినిర్దిస్య వాక్యం అబ్రవీత్ ||

తా|| ఈ విధముగా విన్నవించబడుచున్న ఆ వానరాధిపుని మహాప్రాజ్ఞుడు శత్రువీర సంహారకుడూ అయిన లక్ష్మణుడు ఇలా అడిగెను. " ఓ రాజా వనపాలకుడు అయిన వానరుడు ఎందుకు ఇక్కడికి వచ్చెను? ఎందుకు దుఃఖములో ఉన్నాడు?.దేనిన్ ఇ గురించి చెప్పుచున్నాడు?

శ్లో|| ఏవముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మనా|
లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్యవిశారదః||13||

స|| మహాత్మనా లక్ష్మణేన ఏవం ఉక్తః సుగ్రీవః వాక్యవిశారదః ఇదం వాక్యం లక్ష్మణం ప్రత్యువాచ||

తా|| మహత్ముడైన లక్ష్మణునిచేత ఈవిధముగా అడగబడి వాక్య విశారదుడైన సుగ్రీవుడు ఇట్టి వాక్యములను పలికెను.

శ్లో|| ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దధిముఖః కపిః|
అంగదప్రముఖైర్వీరైః భక్షితం మధు వానరైః||14||
విచిత్య దక్షిణామాశాం ఆగతైర్హరిపుంగవైః|
నైషామకృతకృత్యానాం ఈదృశస్స్యాదుపక్రమః||15||
అగతైశ్చ ప్రమథితం యథా మధువనం హి తైః|
ధర్షితం చ వనం కృత్స్నముపయుక్తం చ వానరైః||16||

స|| ఆర్య లక్ష్మణ వీరః దధిముఖః కపిః సంప్రాహ దక్షిణామ్ ఆశాం దిశాం విచిన్త్య ఆగతైః అంగద ప్రముఖైః వీరైః వానరైః మధు భక్షితం || ఆగతైః తైః వానరైః మధువనం యథా ప్రమథితం కృత్స్నం వనం ధర్షితం ఉపయుక్తం చ ఏషాం అకృతకృత్యానాం ఈదృశః ఉపక్రమః న స్యాత్ ||

తా|| ఓ ఆర్యా! లక్ష్మణా! వానరవీరుడు దధిముఖుడు దక్షిణదిశనుంచి వచ్చిన అంగదాదిప్రముఖులైన వానరుల చేత మధువు భక్షించిరి అని చెప్పుచున్నాడు. ఆ వచ్చిన వానరులచేత ఏవిధముగా ఆ వనమును ఉపయోగించినబడినదో, ధ్వంసము చేయబడినదో (విని) అది కృతకృత్యులుకాని వారు ఇటువంటి పని చేయరు అనిపించుచున్నది.

శ్లో|| వనం యదభిపన్నాస్తే సాధితం కర్మవానరైః|
దృష్టా దేవీ న సందేహో న చాన్యేన హనూమతా||17||
న హ్యన్యః సాధనే హేతుః కర్మణోఽస్య హనూమతః|
కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్వానరపుంగవే||18||
వ్యవసాయశ్చ వీర్యం చ శ్రుతం చాపి ప్రతిష్టితమ్|

స|| తే యదా వనం అభిపన్నాః వానరైః కర్మ సాధితం | దేవీ దృష్టా | న సందేహః న అన్యేన న హనుమతా||అస్య కర్మనః సాధనే హనూమతః అన్యః హేతుః న హి కార్యసిద్ధిః మతిశ్చైవ వ్యవసాయశ్చ వీర్యం చ శ్రుతం చాపి తస్మిన్ వానరపుంగవే ప్రతిష్ఠితామ్||

తా|| "వారు ఏ విధముగా వనమును చేరుకొనినారో దాని బట్టి ఆ వానరులు పని సాధించినవారే. (వారు) దేవి ని తప్పక చూచితిరి. సందేహములేదు ఇంకెవరిచేతనో కాదు హనుమంతునిచేతనే. ఈ కార్య సిద్ధికి హనుమంతుడిలోనే తగిన కార్య దక్షత బుద్ధి పరాక్రమము శాస్త్రజ్ఞానము అన్నీ ప్రతిష్టించబడినాయి".

శ్లో|| జాంబవాన్యత్ర నేతాస్యాదఙ్గదశ్చ మహాబలః||19||
హనుమాంశ్చాప్యధిష్ఠాతా న తస్య గతి రన్యథా|
అఙ్గదప్రముఖైర్వీరైః హతం మధువనం కిల||20||
వారయంతశ్చ సహితాః తథా జానుభిరాహతాః|
ఏతదర్థమయం ప్రాప్తో వక్తుం మధురవా గిహ||21||
నామ్నా దధిముఖో నామ హరిః ప్రఖ్యాతవిక్రమః|

స|| యత్ర జామ్బవాన్ నేతా స్యాత్ మహాబలః అంగదస్య చ హనుమాంశ్చ అధితిష్ఠతా తస్య గతిః అన్యథా న||అంగదప్రముఖైః వీరైః మధువనం హతం కిల| సహితాః వారయన్తశ్చ తదా జానుభిః ఆహతాః||నామ్నా దధిముఖో నామ ప్రఖ్యాత్ విక్రమః హరిః ఏతత్ అర్థం వక్తుం మధురవాక్ ఇహ ప్రాప్తః||

తా|| "ఎక్కడైతే జాంబవంతుడు నేతగా వుండునో మహాబలుడు అంగదుడు హనుమంతుడుల అధిష్టానము వున్నదో అక్కడ విజయము తథ్యము. అంగదాది ప్రముఖులు వీరులు మధువనమును తప్పక ధ్వంశము చేసి ఉండవచ్చు. నివారించిన వారు కాళ్లతో తన్నబడిరి. దధిముఖుడు అనబడు ప్రఖ్యాతి చెందిన వానరుడు ఈ మధురమైన మాటను చెప్పుటకు ఇక్కడికి వచ్చినవాడు".

శ్లో|| దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్యతత్త్వతః||22||
అభిగమ్య తథా సర్వే పిబంతి మధు వానరాః|
న చాప్యదృష్ట్వా వైదేహీం విశ్రుతాః పురుషర్షభ||23||
వనం దత్తవరం దివ్యం ధర్షయేయుర్వనౌకసః|

స|| మహాబాహో సౌమిత్రే సీతా తత్త్వతః దృష్టా| పశ్య తథా వానరాః సర్వే అభిగమ్య మధు పిబన్తి||పురుషర్షభ విశ్రుతాః వనౌకసః వైదేహీం అదృష్ట్వా దత్తవరం దివ్యం వనం న ధర్షయేయుః||

తా|| " ఓ మహాబాహో సీత నిజముగా చూడబడినది. చూడుము. ఆ వానరులందరూ వచ్చి మధువు సేవించుచున్నారు. ఓ పురుషులలో వృషభము వంటి వాడా ! విశ్రుతులైన వానరులు వైదేహిని చూడకుండా వరముగా వచ్చిన దివ్యమైన వనమును ధ్వంశము చేయలేరు".

శ్లో|| తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణః సహ రాఘవః||24||
శ్రుత్వా కర్ణసుఖాం వాణీం సుగ్రీవ వదనాచ్చ్యుతామ్|
ప్రాహృష్యత భృశం రామో లక్ష్మణశ్చ మహాబలః||25||

స|| తతః సహ రాఘవః ధర్మాత్మా లక్ష్మణః ప్రహృష్టః సుగ్రీవవదనాత్ చ్యుతం కర్ణసుఖాం వాణీం శ్రుత్వా ప్రాహృష్యత| రామః లక్ష్మణః మహాబలః చ భృశం ప్రాహృష్యత||

తా|| అప్పుడు రాఘవునితో కూడిన ధర్మాత్ముడు అగు లక్ష్మణుడు సంతోషముతో వున్న సుగ్రీవుని నోటినుంచి వచ్చిన వాక్యములను విని అనందభరితులైరి. రాముడు లక్షమణుడు కూడా అధికముగా ప్రసన్నులైరి.

శ్లో|| శ్రుత్వా దధిముఖస్యేదం సుగ్రీవస్తు ప్రహృష్య చ |
వనపాలం పునర్వాక్యం సుగ్రీవః ప్రత్యభాషత||26||

స|| సుగ్రీవః దధిముఖస్య ఇదం శ్రుత్వా సంప్రహృష్య చ పునః వనపాలం వాక్యం ప్రత్యభాషత||

తా|| సుగ్రీవుడు దధిముఖుని ఈ వచనములను విని సంతోషముతో మళ్ళీ వనపాలునితో ఈ వాక్యములతో సమాధానమిచ్చెను.

శ్లో|| ప్రీతోఽస్మి సోఽహం యద్భుక్తం వనం తైః కృతకర్మభిః|
మర్షితం మర్షణీయం చ చేష్టితం కృతకర్మణామ్||27||
ఇచ్ఛామి శీఘ్రం హనుమత్ప్రధానాన్
శాఖామృగాం స్తాన్ మృగరాజ దర్పాన్|
ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం
శ్రోతుం చ సీతాధిగమే ప్రయత్నమ్||28||

స|| కృతకర్మభిః తైః వనం యత్ భుక్తం సః అహం ప్రీతః | కృతకార్యమాణామ్ మర్షణీయం చేష్టితం మర్షితామ్||హనుమత్ప్రధానాన్ మృగరాజదర్పాన్ కృతార్థాన్ తాన్ శాఖామృగాన్ రాఘవాభ్యాం సహ ద్రష్టుం సీతాధిగమేన ప్రయత్నం శ్రోతుం చ ఇచ్ఛామి||

తా|| "కార్యసిద్ధి సాధించినవారిచేత భుజింపబడిన ఆ వనము గురించి (విని) నాకు సంతోషము గా వున్నది. కృత కృత్యులైనవారిచేత చేయబడిన చేయకూడని కార్యము క్షమించబడినది. కృతార్థులైన సింహపరాక్రమము గల హనుమదాది ప్రముఖుల ను వెంటనే చూడాలని , సీతను కనుగొనుటకై చేసిన ప్రయత్నము గురించి వినాలని కోరికగా వున్నది".

శ్లో|| ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారౌ
దృష్ట్వా సిద్దార్థౌ వానరాణాం చ రాజా|
అంగైః సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా
బాహ్వోరాసన్నాం సోఽతిమాత్రం ననంద||29||

స|| సః వానరాణాం రాజా ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ సిద్ధార్థౌ కుమారౌ దృష్ట్వా సంహృష్టైః అంగైః కర్మసిద్ధిం బాహ్వోః ఆసన్నాం విదిత్వా అతిమాత్రం ననన్ద||

తా|| ఆ వానరులరాజు సంతోషముతో నిండిన కళ్ళుకలవాడై , సిద్దిపొందిన ఆ రాజకుమారులను చూచి కర్మసిద్ధి కాబోతున్నదని గ్రహించి అంగములన్నీ సంతోషముతో పులకిరించగా అతదు అతి ఆనందము పొందెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రిషష్టితమస్సర్గః ||

ఈ విధముగా వాల్మీకి రామయణములో సుందరకాండలో అరువది మూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||